కొమ్మలపూడి: రైలు పట్టాలపై గుర్తు తెలియని డెడ్ బాడీ

మనుబోలు-కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. విజయవాడ-చెన్నై మార్గంలో 150/11-09 కిలోమీటర్ల వద్ద రైలు నుంచి జారిపడి అతను మరణించినట్లు తెలుస్తోంది. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, అతను సిమెంట్ రంగు హాఫ్ హాండ్స్ టీ షర్ట్, నలుపు రంగు ఫాంట్ ధరించి ఉన్నాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్