నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జరిగిన వ్యవసాయ స్థాయి సంఘ సమావేశంలో పెళ్ళకూరు మండల జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా పాల్గొన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో పంపిణీ జరిగేలా చూసి రైతులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని సూచించారు.