తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నెల్లూరుకు చెందిన విద్యార్థి సాయి చందు (20) హాస్టల్ టెర్రస్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన జరిగింది. ప్రేమ వ్యవహారం లేదా ఆర్థిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.