నేడు విజయనగరం జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్ కార్యక్రమం

విజయనగరం జిల్లా కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఇవాళ పీజీఆర్ఎస్‌ (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ అండ్‌ రెడ్రెసల్‌ సిస్టమ్‌) కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి తెలిపారు. ప్రజల సమస్యలు, అభ్యర్థనలు, ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం చూపించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. అర్జీదారులు తమ వివరాలతో పాటు పాత అర్జీల స్లిప్పులు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్