తెర్లాం మండలంలోని అంట్లువార గ్రామానికి చెందిన సోపేటి ఫకీరు కు చెందిన ఆవు మంగళవారం పిడుగు పడి మృతి చెందింది. మేత కోసం ఆవును పొలానికి తీసుకెళ్లిన సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అతనికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.