AP: సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలో జరుగుతున్న 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం మహిళలకు అత్యంత సురక్షిత నగరమని, పచ్చదనం పరిశుభ్రతతో కూడిన అందమైన నగరమని అన్నారు. విశాఖలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఆయన సదస్సు వద్ద ఏర్పాటు చేసిన సందర్శన స్టాల్స్ ప్రారంభించారు.