మాజీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్, వైసీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ భాషా ఆదివారం విశాఖలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 'రెడ్ బుక్ రాజ్యాంగం' నడుస్తోందని, దీనివల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ 'రెడ్ బుక్ రాజ్యాంగాన్ని' అణిచివేసేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యూఆర్ కోడ్తో డిజిటల్ బుక్ రూపొందించారని, ప్రజలు తమ సమస్యలను అందులో నమోదు చేయాలని ఆయన సూచించారు.