రుషికొండ నిర్మాణాల తనిఖీ కోసం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన సొంత కమిటీని ఏర్పాటు చేయనుంది. గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్లో ఏపీ అధికారులను చేర్చడంపై న్యాయస్థానం ప్రశ్నించింది, అసంతృప్తి వ్యక్తం చేసింది. దీని తర్వాత, హైకోర్టు కొత్త కమిటీని నియమించాలని నిర్ణయించుకుంది. ఈమేరకు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే సొంతకమిటీ విశాఖలోని రుషికొండలో పర్యటించనుంది.