అనకాపల్లి జిల్లా రావికమతం అంబేద్కర్ కాలనీ వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీపీఎం, కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గత నెల 24న అధికారులు, ప్రజాప్రతినిధులు స్థలాన్ని పరిశీలించినా, 11 రోజులు గడిచినా చెత్త తొలగించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చెత్తను తొలగించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.