ప్రజల ఆరోగ్యం కోసం వైద్య సేవలను యూనివర్సల్ డిజిటలైజ్డ్ విధానంలో అందిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. బుధవారం, ఎన్టీపీసీ అందించిన రూ. 2 కోట్ల సీఎస్ఆర్ నిధులతో విశాఖ కేజీహెచ్ నెఫ్రాలజీ విభాగంలో ఆధునికీకరించిన హీమో డయాలసిస్ యూనిట్ను ఆయన పునఃప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి యూనిట్ను పరిశీలించారు.