విశాఖ: మంత్రి దృష్టికి మత్స్యకారుల సమస్యలు

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర మరపడవల సంఘం డిమాండ్ చేసింది. ముఖ్యంగా, డీజిల్ ఆయిల్ సబ్సిడీని లీటరుకు రూ. 12కు పెంచుతామన్న ముఖ్యమంత్రి హామీని వెంటనే అమలు చేయాలని కోరింది. బుధవారం టీడీపీ విశాఖ దక్షిణ ఇంచార్జి సీతంరాజు సుధాకర్ నేతృత్వంలో ఈ సంఘం జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలిసి వినతి పత్రం సమర్పించింది. సుమారు రెండు కోట్ల రూపాయల డీజిల్ బకాయిల సబ్సిడీ విడుదల చేయాలని కూడా సంఘం మంత్రిని కోరింది.

సంబంధిత పోస్ట్