విశాఖలోని సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి అనే యువకుడు ఒడిశా యువకులతో కలిసి రెండు రోజుల క్రితం గంగవరం సాగర్తీరంలోని మాధవస్వామి గుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి అతను గల్లంతయ్యాడు. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినప్పటికీ అతడు లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే అతని మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.