విశాఖ: పర్యవరణాన్ని పరిరక్షిద్దాం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ను నివారించి, వస్త్ర సంచులను వినియోగించాలని జెర్రిపోతులపాలెం పంచాయతీ సర్పంచ్ మడక అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో విశాఖలోని మేఘాద్రిగెడ్డ జలాశయం వద్ద చేపల వేటపై ఆధారపడినవారితో జరిగిన సమావేశంలో ఆయన ఈ పిలుపునిచ్చారు. 'స్వచ్ఛతా హి సేవ' కార్యక్రమాలను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటి పెంచాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్