YCP సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో కలిసి పోరాడేందుకు సిద్ధమని తెలిపారు. ప్లాంట్ రక్షణ కోసం కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలను ఐక్యం చేస్తామని వెల్లడించారు. ప్రధాని వద్దకు కలసి వెళ్లేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో మంత్రులు, MLAల అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.