ఆచంట - మార్టేరు ప్రధాన రహదారిలో బాలంవారిపాలెం వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఏడుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 కేజీలకు పైగా గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆచంట మండలానికి చెందిన కోట భానుసందీప్, వేములూరి ప్రభాస్, చెల్లెం పృథ్విరాజ్, నక్క బాలకృష్ణ, వెళగన వాసు, పెనుగొండకు చెందిన గెద్దాడ సుభాష్, దేవతల కృష్ణబాబులపై కేసు నమోదు చేశారు.