భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ, భగవంతుని సన్నిధిలో సేవ చేయడం అదృష్టమని తెలిపారు. భీమవరం శ్రీరాంపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 8 మంది సభ్యులతో పాలకవర్గం నియమింపబడింది. నూతన పాలకవర్గ సభ్యులు త్రివిక్రమ మూర్తి, గురు మూర్తి తదితరులు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూడా ఆలయ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని సూచించారు.