చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, 2025-26 సంవత్సరానికి సంబంధించి పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో రైతు కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన, రైతులందరూ జంగారెడ్డిగూడెం సబ్ యార్డ్ సెంటర్లో జిన్నింగ్ తెచ్చి పత్తి అమ్ముకొని మద్దతు ధర పొందవచ్చని సూచించారు.