ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం నరసన్న పాలెం గ్రామంలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షం కారణంగా లారీ అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ నుండి రాజమండ్రికి వేస్ట్ పేపర్ల లోడుతో వెళుతున్న లారీ ఈ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు, లారీ డ్రైవర్ ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డాడు.