ఇటీవల సంభవించిన మోంథా తుఫాన్ కారణంగా తణుకు రూరల్ మండలం దువ్వ, ముద్దాపురం గ్రామాలలో నీట మునిగిన పంట పొలాలను ఆదివారం మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ఆయన రైతులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ రుద్రా ధనరాజు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గోపాల కృష్ణ, అడ్డ బాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.