AP: మహిళలను గౌరవించడం భారత సంప్రదాయమని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్ర పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారు. వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదు. అభివృద్ధిలో మహిళలది కీలక పాత్ర. వారి కోసం రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించింది. మహిళా శక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే భారత్ ముఖ్యదేశంగా అవతరించింది’ అని అన్నారు.