AP: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, డిజిటల్ బుక్ల పేరుతో వైసీపీ నాయకులు అధికారులను, పోలీసులను బెదిరిస్తున్నారని మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటాపురంలో 23 మంది లబ్ధిదారులకు రూ.28.06 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాగే వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆమె హెచ్చరించారు.