ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా విశాఖ వేదికగా నిర్వహించిన యోగాంధ్ర విజయవంతమవడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష చేపట్టారు. యోగాంధ్రలో 3లక్షల మందికిపైగా పాల్గొన్నారని.. వారి వల్లే ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తెలిపారు. గిన్నిస్ రికార్డులు సాధించడంపై ప్రజాప్రతినిధులు, ఉద్యోగులకు సీఎం అభినందనలు తెలిపారు.