ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న జీఎస్టీ సభలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఇనుప రాడ్తో కూడిన కూటమి జెండా కరెంట్ తీగకు తగలడంతో అర్జున్ అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.