వైసీపీ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. అసెంబ్లీ సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, అవినీతి బయటపడుతుందనే భయంతోనే వైసీపీ సభ్యులు సభకు రావడం లేదని విమర్శించారు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వనందున దానిని సాకుగా చూపడం సరికాదని.. కుంటిసాకులు చెప్పి కావాలనే సభకు రావడం లేదని అన్నారు.