యూపీలోని మథురకు చెందిన కాజల్ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ముఖ్యంగా ధనవంతులైన పెళ్లికాని యువకులను ప్రేమించి, పెళ్లి చేసుకుని, వారి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు దోచుకుని పారిపోయేది. ఈ మోసాలకు కాజల్ తండ్రి భగత్ సింగ్, తల్లి సరోజ్ దేవి కూడా సహకరించేవారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. తాజాగా పట్టుబడిన కాజల్, 10 కంటే ఎక్కువ మందిని ఇదే విధంగా మోసం చేసినట్లు తెలుస్తోంది.