ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ (52 నాటౌట్) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, శ్రీలంక బౌలర్లను బెంబేలెత్తించాడు. ఇది ఈ టోర్నీలో అతనికి వరుసగా మూడవ అర్ధశతకం. అభిషేక్ ధాటికి భారత్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శుభ్మన్ గిల్ (4) త్వరగా ఔటైనా, అభిషేక్ జోరు కొనసాగించాడు.