ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్, ఏఐ స్టార్టప్ పెర్ప్లెక్సిటీకి నోటీసులు జారీ చేసింది. తమ ఏఐ ఆధారిత వెబ్బ్రౌజర్ కామెట్ ద్వారా అమెజాన్లో షాపింగ్ సదుపాయాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ స్పందిస్తూ, అమెజాన్తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, అయితే కామెట్ అసిస్టెంట్ను బ్లాక్ చేస్తే తమ వినియోగదారులకు నష్టం చేకూరుస్తుందని తెలిపారు.