భార్యపై కోపంతో బావిలోకి దూకేశాడు.. చివరికి

AP: బెంగళూరుకు చెందిన చెంగాచారి (26) శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సోదరి ఇంటికి భార్యాపిల్లలతో వచ్చాడు. భార్యతో గొడవపడి తన చేయి కోసుకుని బావిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. బావిలో నీరు లేకపోవడంతో గాయపడిన అతన్ని స్థానికులు, సీఐ సత్యనారాయణ జీపు డ్రైవర్ అమర్నాథ్ కలిసి రక్షించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎస్పీ ధీరజ్ కానిస్టేబుల్ అమర్నాథ్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్