ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. బసవతారకం ఆసుపత్రి ప్రముఖులతో కలిసి ఆయన సోమవారం ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)ను సందర్శించారు. ఈ నేపథ్యంలో అధికారుల విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను మోగించారు. దీంతో ఎన్ఎస్ఈ బెల్ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా బాలయ్య నిలిచారు. కాగా ఇటీవలే ఆయనకు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కిన విషయం తెలిసిందే.