సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన మానసిక ఆరోగ్యంపై మరోసారి దృష్టి సారింపజేసింది. చిన్నచిన్న జీవులను చూసి కూడా భయపడే ఒక మహిళ చివరికి అదే భయంతో ప్రాణాలు తీసుకుంది. మంచిర్యాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్ భార్య మనీష (25) మూడు ఏళ్ల కుమార్తెతో కలిసి అమీన్పూర్ పరిధి నవ్య హోమ్స్లో నివసిస్తోంది. చిన్నప్పటి నుంచే ఆమెకు మిర్మికోఫోబియా అనే చీమల భయం ఉంది. ఈ భయాన్ని తగ్గించేందుకు గతంలో సైకాలజిస్టుల వద్ద కౌన్సెలింగ్ కూడా తీసుకుంది.