అబుదాబిలో ఆస్ట్రేలియాపై జరుగుతున్న మ్యాచ్లో టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి దూకుడుగా ఆడుతున్నాడు. మాథ్యూ కుహ్నెమాన్ వేసిన ఓవర్లో టీమ్ఇండియా 9 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ శర్మ 51 పరుగులతో, హర్షిత్ రాణా 23 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 13 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 92/5గా ఉంది.