బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 71 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ తారాపుర్ నుంచి, మరో డిప్యూటీ సీఎం విజయ్కుమార్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. మంత్రులు నితిన్ నబీన్ (బాంకీపుర్), రేణు దేవీ (బేతియా), మంగల్ పాండే (సీవాన్) నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. భాజపా మొత్తం 101 స్థానాల్లో పోటీ చేయనుంది.