ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, లక్ష్మణ్ సహా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహంపై ఈ సందర్భంగా చర్చించారు. అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలపడంతో పాటు, జూబ్లీహిల్స్ అభ్యర్థిని కూడా కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనుంది.