తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను మంత్రులు అవమానించారని, దీనిపై మంత్రులకి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకున్నారని, కమ్మ సామాజికవర్గం ఓట్లతో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.