TG: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ తీర్పు ఆధారంగా.. నవంబర్ 7న కేబినెట్ సమావేశం నిర్వహించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ 3న విచారణకు రాగా.. ధర్మాసనం విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఈ నెల 7న జరిగే కేభినేట్ భేటీలో స్థానిక ఎన్నికలపై రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.