బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నిరోధించడంలో విఫలమయ్యారని, 'అమిత్షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి' అంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి కాస్త రాజకీయ దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యవహారంలో మహువాపై కేసు నమోదైంది. ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్ పోలీసులు తెలిపారు. ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని, రాజ్యాంగ విరుద్ధమని ఫిర్యాదుదారు ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు.