చైనా మాస్టర్స్ 2025 మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పీవీ సింధు డెన్మార్క్ ప్లేయర్ జూలీ జాకోబ్సెన్పై 21-5, 21-10 తేడాతో 27 నిమిషాల్లో విజయం సాధించింది. గతంలో స్విస్ ఓపెన్లో జాకోబ్సెన్ చేతిలో ఓడిన సింధు ఈసారి ఆధిపత్యం చూపించింది. రెండో రౌండ్లో సింధు థాయిలాండ్కి చెందిన 6వ సీడ్ పోర్న్పావీ చోచువాంగ్ను ఎదుర్కోనుంది. హెడ్ టు హెడ్లో సింధు 6-5 ఆధిక్యంలో ఉంది.