TG: నగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లి వద్ద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) సొరంగం తవ్వకం పనులను పునరుద్దరించారు. ఇందులో భాగంగా ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను సీఎం రేవంత్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వే నిర్వహిస్తున్న హెలికాప్టర్కు సమాంతరంగా మరో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ, కిటికీ నుంచి ఈ ఎస్ఎల్బీసీ సొరంగం సర్వే ప్రక్రియను సీఎం, మంత్రులు వీక్షించారు.