TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. బుధవారం ఓ న్యూస్ చానల్ తో జూపల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఒక్కొక్కరిపై రూ.4 లక్షల అప్పు మోపారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు బుల్డోజర్ పాలన చేసింది బీఆర్ఎస్సేనని అన్నారు. అధికారులను తాను బెదిరిస్తున్నాననే ప్రచారాన్ని ఆయన ఖండించారు. తన గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు లేదని అన్నారు. కావాలంటే తాను చర్చకు సిద్ధమని, దమ్ముంటే కేటీఆర్ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు.