TG: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో నియోజకవర్గ ఇన్చార్జ్లతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై సూచనలు చేశారు. ఈ వారం రోజులు ఫలితాలను నిర్ణయిస్తాయని, ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో ప్రచారం చేస్తే విజయం సాధించవచ్చని చెప్పారు.