TG: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎకరానికి 25 క్వింటాళ్ల వరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఎండీని మంత్రి ఆదేశించారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.