రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి

AP: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. విశాఖ జిల్లా చిన్నముషిడివాడకు చెందిన రామ్ సుధీర్, లావణ్య దంపతులు అనంతపురంలో ఉంటున్నారు. వీరిద్దరూ తమ కొడుకు అద్విక్‌తో కలిసి కారులో హంపీ బయలుదేరారు. ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొట్టడంతో లావణ్య, సుధీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్