UPలోని మీరట్ పరిధి కిలా పరీక్షిత్గఢ్లో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పవర్ హౌస్లో వంట చేయాలని తల్లి, కుమార్తెను పిలిపించారు. అక్కడ సెక్యూరిటీ గార్డు హర్వీర్ తుపాకీతో బాలికను, ఆమె తల్లిని బెదిరించారు. తల్లి ముందే కుమార్తెపై అత్యాచారం చేశాడు. దీనిని అక్కడున్న మరో వ్యక్తి మొబైల్లో వీడియో తీశాడు. ఆ వీడియోను నిందితుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీనిపై బాధితురాలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.