ఎంపీలోని మాళ్వాలో బీజేపీ నాయకుడి కారులో రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసులు పట్టుకున్నారు. బీజేపీ మండల ఉపాధ్యక్షుడు రాహుల్ అంజనా కారులో డ్రగ్స్ తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. 9.250 కిలోల కెటామైన్, 12.100 కిలోల అమ్మోనియం క్లోరైడ్, 6 గ్రాముల MD డ్రగ్స్, 35 లీటర్ల రసాయనాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులు మాల్వియా, దౌలత్ సింగ్లను అరెస్ట్ చేయగా.. రాహుల్ అంజనా పరారీలో ఉన్నారు.