నేపాల్ ప్రభుత్వం 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను బ్లాక్ చేసింది. దీంతో నేపాల్ రాజధాని ఖాట్మండూలో యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగింది. సోమవారం పార్లమెంట్ను నిరసనకారులు ముట్టడించారు. లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా, 80 మంది గాయపడ్డారు.