ఘోర బస్సు ప్రమాదం.. 15 మంది మృతి (వీడియో)

హిమాచల్‌ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టూరిస్ట్ బస్సుపై కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్