సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడ గ్రామానికి చెందిన గొల్ల విఠల్ కూతురు.. అదే గ్రామానికి చెందిన బోయిని నగేశ్ ను కొద్దిరోజుల కింద ప్రేమ పెండ్లి చేసుకుంది. తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందని యువతి తండ్రి విఠల్, కుమారుడు పాండుతో కలిసి నగేష్ తండ్రి పై ఇద్దరూ కలిసి విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.