TG: రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఓ మహిళా అధికారిణి. హైదరాబాద్ శివారులోని నార్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్న మణి హారిక.. మంచిరేవులలోని వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ LRS క్లియర్ చేసేందుకు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో రూ. 4 లక్షలు వినోద్ నుంచి తీసుకుంటుండగా ఆమెను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.