ముంబైలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. వారిలో ఒకరు వికలాంగ బాలిక కాగా మరో నాలుగేళ్ళ బాలుడు ఉన్నాడు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. అంతే కాకుండా 36 మంది నివాసితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.