AP: రేణిగుంట విమాశ్రయంలో గురువారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దయింది. ప్రయాణికులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాన్ని రద్దు చేయడంపై నటుడు ప్రదీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్పైస్ జెట్ నిర్వహకులతో ఆయనతో పాటు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.